వైసిపి సిట్టింగ్ ఎంఎల్సి దువ్వాడ శ్రీనివాస్కు గట్టి షాక్ తప్పలేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను వైకాపా నుంచి సస్పెండ్ చేసింది పార్టీ. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘింటినట్లు వచ్చిన ఫిర్యాదుతో వైకాపా చీఫ్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటన చేసింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ తలపట్టుకున్నారు.
తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. మరోవైపు అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా గుడివాడ అమర్నాథ్ను, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా కె.కె. రాజును వైఎస్ జగన్ నియమించారు. కాగా ఈ సస్పెండ్పై దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
అయితే గతకొద్ది కాలంగా కుటుంబ గొడవలతో దువ్వాడ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా మాధురితో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నారు. భార్యకు విడాకులిచ్చి మాధురిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ కారణాల రీత్యా పార్టీకి నష్టం ఏర్పడే అవకాశం వుందని వైకాపా ఆయన్ని దూరం పెట్టినట్లు తెలుస్తోంది.