Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

Advertiesment
enforcement directorate

ఠాగూర్

, గురువారం, 17 ఏప్రియల్ 2025 (18:36 IST)
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (#Jagan) అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (#ED) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.793 కోట్ల విలువ చేసే దాల్మియా సిమెంట్ (#DalimaCement) ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయం మార్చి 31వ తేదీన తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి లీజుల దాల్మియాకు అక్రమంగా కట్టబెట్టారని అభియోగం ఉంది. దాల్మియా నుంచి జగన్ సుమారు రూ.150 కోట్ల ముడుపులు తీసుకున్నారని సీబీఐ (#CBI) చార్జిషీటు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ అటాచ్‌‍మెంట్ ఉత్తర్వులు ఈ నెల 15వ తేదీన రాత్రి దాల్మియా సిమెంట్స్‌కు అందాయి. కొనుగోలు చేసినపుడు ఆ భూమి విలువ రూ.377 కోట్లు కాగా, ఇపుడు రూ.793 కోట్లుగా పేర్కొంది. కడప జిల్లా మైలవరం మండలంలోని తలమంచిపట్నం, నవాబ్ పేటలో 407 హెక్టార్లలో సున్నపురాయి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ, ఈడీ అభియోగాలు మోపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత మార్కెట్లో సరికొత్త గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్, ధరలివే