Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జోరువాన‌లో కూడా ఎమ్మెల్యే విష్ణు... గుడ్ మార్నింగ్ విజ‌య‌వాడ‌

Advertiesment
జోరువాన‌లో కూడా ఎమ్మెల్యే విష్ణు... గుడ్ మార్నింగ్ విజ‌య‌వాడ‌
విజయవాడ , శనివారం, 21 ఆగస్టు 2021 (16:07 IST)
గుడ్ మార్నింగ్ విజ‌య‌వాడ అంటూ... ఎమ్మెల్యే విష్ణు త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని డివిజ‌న్ల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. విజయవాడలో జోరువానలో కూడా ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు డివిజన్ పర్యటన చేస్తున్నారు.
న‌గ‌రంలోని ముత్యాలంపాడు 31వ. డివిజన్లలో జడివానలో సాగిన గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమానికి మంచి స్పంద‌న ల‌భించింది. ఇందులో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై గడప గడపకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు.
 
ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. స్థానిక స‌మస్య‌లు ఏమున్నాత‌న‌కు అర్ధ‌రాత్రి అని కూడా లేకుండా నిద్ర లేపి మ‌రీ అడ‌గొచ్చ‌న్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమన్ని విమర్శించే వారు ప్రజా నాయకులే కాద‌ని ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శించారు.  న‌గ‌రంలో ఇళ్ల పట్టాల పంపిణీ నిత్య ప్రక్రియ అని, పెద్ద ఎత్తున అమలువుతున్న సంక్షేమ పథకాలు చూసి టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నార‌ని అన్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేద‌ని, చంద్రబాబు స్థాయి దిగజారి గల్లీ లీడర్ గా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.
 
చంద్రబాబు టీడీపీ నేతలు చేస్తున్న నీచ రాజకీయాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేర‌ని, సీఎం జగన్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతల్లో మార్పు రావాల‌ని ఆకాంక్షించారు. గ‌త‌తంలో రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు తుంగలో తొక్కార‌ని విమ‌ర్శించారు మ‌ల్లాది విష్ణు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#BulletBandi పాటకు #NurseDance వీడియో వైరల్