Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాక్టర్ సూర్యకుమారి మృతదేహం కాల్వలో... లొంగదీసుకుని మోసం చేసినందుకే....

డాక్టర్ సూర్య కుమారి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె మృతదేహం రైవ‌స్ కాలువలో లభ్యమైంది. ఐదు రోజుల క్రితం ఆచూకి లేకుండా పోయిన సూర్యకుమారి కోసం పోలీసులు గాలించారు. ఐతే ఆమె స్కూటీని రైవస్ కాలువ ఒడ్డున చూసిన‌ట్లు స్థానికులు చెప్పడంతో ఎన్డీఆర్ఎ

డాక్టర్ సూర్యకుమారి మృతదేహం కాల్వలో... లొంగదీసుకుని మోసం చేసినందుకే....
, శనివారం, 5 ఆగస్టు 2017 (22:34 IST)
డాక్టర్ సూర్య కుమారి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె మృతదేహం రైవ‌స్ కాలువలో లభ్యమైంది. ఐదు రోజుల క్రితం ఆచూకి లేకుండా పోయిన సూర్యకుమారి కోసం పోలీసులు గాలించారు. ఐతే ఆమె స్కూటీని రైవస్ కాలువ ఒడ్డున చూసిన‌ట్లు స్థానికులు చెప్పడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం కాలువ‌లో గాలించింది.
 
మొత్తం 27 మంది ప్ర‌త్యేక బృందం 14 కిలోమీట‌ర్ల మేర గాలించగా సూర్య‌కుమారి మృత‌దేహం లభించింది. గత ఐదు రోజులగా నీళ్లలోనే వుండటంతో ఆమె మృత‌దేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరోవైపు ఆమెది ఆత్మహత్యగానే పోలీసులు నిర్థారించారు. 
 
కాగా విద్యాసాగర్ ఆమెను 7 ఏళ్లుగా లోబర్చుకున్నాడనీ, అతడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. వివాహం అయిన తర్వాత కూడా ఆమెతో గడిపాడనీ, తనకు వివాహం అయిన సంగతి ఆమె వద్ద దాచిపెట్టి సంబంధాన్ని సాగించాడని తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డా. గజల్ శ్రీనివాస్‌కు “ఆఫ్ఘానిస్తాన్ ఒలింపిక్ శాంతి పతకం ప్రధానం”