Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైద్య పరీక్షలు.. ఎందుకో తెలుసా?

jagan
, మంగళవారం, 22 ఆగస్టు 2023 (08:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విజయవాడలోని ఒక ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లో ఈ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా కాలి మడమ నొప్పితో బాధ పడుతున్నారు. 
 
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మొగల్రాజపురంలోని ఓ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు వచ్చారు. ఎంఆర్‌ఐ స్కాన్‌తో పాటు వివిధ రక్త పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. రెండు గంటల పాటు ల్యాబ్‌లోనే ఉన్నారు. తిరిగి మూడు గంటల సమయంలో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లారు. సీఎం సతీమణి భారతి రెడ్డి వెంట ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ వేరియంట్ ఎరిస్ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసా?