Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి: సీఎం జ‌గ‌న్

అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి:  సీఎం జ‌గ‌న్
, మంగళవారం, 20 జులై 2021 (22:12 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులకు త‌న శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు.

దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ముస్లిం సోద‌రులంతా ఈ పండుగ జరుపుకుంటారన్నార‌ని పేర్కొన్నారు. భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ  పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్ అభిలషించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ను ఆవిష్కరించిన నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌