ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ముస్లిం సోదరులంతా ఈ పండుగ జరుపుకుంటారన్నారని పేర్కొన్నారు. భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ  పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్ అభిలషించారు.