Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ సీఎం చంద్ర‌బాబు, నారా లోకేష్‌కు మావోయిస్టుల బెదిరింపు లేఖ‌... ఆత్మాహుతి దాడి చేస్తాం...

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దులో భారీ ఎన్‌కౌంట‌ర్‌ను ఖండిస్తూ, ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు తేనె పూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావో

ఏపీ సీఎం చంద్ర‌బాబు, నారా లోకేష్‌కు మావోయిస్టుల బెదిరింపు లేఖ‌... ఆత్మాహుతి దాడి చేస్తాం...
, బుధవారం, 26 అక్టోబరు 2016 (19:17 IST)
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దులో భారీ ఎన్‌కౌంట‌ర్‌ను ఖండిస్తూ, ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు తేనె పూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావోయిస్టు ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్ తన లేఖలో పేర్కొన్నారు. 
 
ఏఓబీలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని ఆయన మండిపడ్డారు. భోజనంలో విషం పెట్టి చంపారని ఆరోపించారు. చంద్రబాబు ఇంతకింత ఫలితాన్ని అనుభవిస్తారనీ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ బాబులపై అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. పోలీసు అధికారులను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అగ్ర నాయకత్వాన్ని మట్టుబెట్టాలన్న ప్రణాళికతోనే ఈ ఎన్ కౌంటర్ చేశారనీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కుట్ర ఫలితంగానే ఏఓబీ ఎన్‌కౌంటర్ జరిగిందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో ఉచిత ఆఫర్‌తో ఎయిర్‌టెల్ బెంబేలు... జీవితాంతం ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు... ట్రాయ్‌కు విజ్ఞప్తి