Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌న్యం పర్యాటక ప్రాంతాల‌లో మందు తాగి అల్ల‌రి చేస్తే ఖ‌బ‌డ్డార్

మ‌న్యం పర్యాటక ప్రాంతాల‌లో మందు తాగి అల్ల‌రి చేస్తే ఖ‌బ‌డ్డార్
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:44 IST)
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు. మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మారేడుమిల్లి, గుర్తేడు పోలీస్‌స్టేషన్లలో దస్త్రాలను పరిశీలించారు.
 
 
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగల సందర్భంగా మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో సందర్శకుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. అతిథిగృహాలు, రిసార్టులపైనా పూర్తి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
 
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అవసరమైతే పండగల సమయాల్లో తాను మారేడుమిల్లిలోనే బస చేస్తానన్నారు. మారేడుమిల్లి ఇన్‌ఛార్జి సీఐ త్రినాథ్‌, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రామకృష్ణ, సతీశ్‌ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒమిక్రాన్: ఆన్‌లైన్ వివాహానికి కోర్టు గ్రీన్ సిగ్నల్