Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆడపిల్ల అంత పాపం చేసి పుడుతోందా: మనీషా ఆవేదన

స్త్రీలను దేవతలుగా కొలిచే సమాజాల్లో ఆడపిల్లలు పుడితే చాలు కుటుంబాలు ఎందుకంత ఆగ్రహం చెందుతున్నాయో అర్థం కావడం లేదని బాలీవుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ జాతీయ సమావేశాల్లో అతిథిగా పాల్గొన్న మనీషా

Advertiesment
amaravati
హైదరాబాద్ , శనివారం, 11 ఫిబ్రవరి 2017 (03:11 IST)
స్త్రీలను దేవతలుగా కొలిచే సమాజాల్లో ఆడపిల్లలు పుడితే చాలు కుటుంబాలు ఎందుకంత ఆగ్రహం చెందుతున్నాయో అర్థం కావడం లేదని బాలీవుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ జాతీయ సమావేశాల్లో అతిథిగా పాల్గొన్న మనీషా తన జన్మ విషయంలో కూడా తమ తాత అలాగే బాధపడ్డారని తెలిపి విచారం వ్యక్తం చేశారు. 
 
‘నేను పుట్టినప్పుడు మా తాత ఎంతో బాధపడ్డారట. ఆడపిల్ల పుట్టిందే అని ఆయన ముఖం చిన్నబోయిందట. నేను పెద్ద అయిన తరువాత నాకు ఆ విషయం తెలిసి ఎంతో ఆవేదన చెందా. ఎంత ఉన్నత స్థాయికి చేరినా ఆ ఆవేదన తీరలేదు. ఇలాంటివాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత యువతులదే’ అన్నారు.
 
భారతదేశంలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంపై మనీషా కొయిరాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 48 శాతంగా ఉంటే పార్లమెంటులో మాత్రం మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య 11 శాతంగా ఉండడం సరికాదని అభిప్రాయపడ్డారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారో లేదో కానీ.. ఇదొక కొత్త టెన్షన్!