Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

కుమారుడిని మందలించిన పాపానికి తండ్రి హత్య

Advertiesment
crime
, బుధవారం, 28 సెప్టెంబరు 2022 (14:29 IST)
చెడు వ్యసనాలకు అలవాటు పడిన కుమారుడిని మందలించిన పాపానికి తండ్రి హత్యకు గురైనాడు. మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న కన్న తండ్రినే కొడుకు కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఈ హృదయ విధారక ఘటన జిల్లా వాసులను తీవ్రంగా కలచి వేసింది. 
 
కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కోసిగి నాల్గవ వార్డులో అల్లమ్మ, వీరయ్య దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. వీరి పెద్దకుమారుడు నరసింహులు చదువు మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మద్యంకు బానిస అయ్యాడు.
 
నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి ఆ మత్తులో తల్లిదండ్రులను వేధించేవాడు. కొడుకుకు బుద్ది చెప్పాలని తండ్రి వీరయ్య కొడుకు నరసింహులను పలుమార్లు మందలించాడు.
 
ఇలా తరచూ తండ్రి మందలిస్తుండడంతో మద్యం మత్తులో గొడ్డలితో తండ్రి గొంతుపై నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడును అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ వంటి చిన్నరాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.. సీఎం జగన్