Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోన్‌లో మాట్లాడుతూ.. బావిలో పడిపోయాడు.. 17 గంటలు అక్కడే వుండిపోయాడు..

ఫోన్‌లో మాట్లాడుతూ.. బావిలో పడిపోయాడు.. 17 గంటలు అక్కడే వుండిపోయాడు..
, శనివారం, 3 జులై 2021 (08:47 IST)
చేతిలో ఫోన్ వుంటే చాలు. చాలామంది చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎక్కడున్నామనే విషయాన్ని మరిచిపోతుంటారు. తాజాగా ఓ వ్యక్తి తాను ఫోనులో మాట్లాడుతూ బావి పక్కన వున్నామనే విషయాన్ని మరిచిపోయాడు. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్లి 60 అడుగుల లోతున్న పాడుబడిన బావిలో పడిపోయాడు. 
 
రక్షించాలని కేకలు వేశాడు.. సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో అటుగా వచ్చిన పశువుల కాపరికి కేకలు వినిపించడంతో బావిలో ఓ వ్యక్తి పడినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
కాగా ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరుకు చెందిన చంద్రశేఖర్ గురువారం మధ్యాహ్నం పట్టణానికి సమీపంలోని దాబాలో భోజనం చేశాడు. అనంతరం ఫోన్ మాట్లాడుకుంటూ దాబా వెనక్కు నడిచివెళ్ళాడు. ఇదే సమయంలో అక్కడ పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆ బావిలో 20 అడుగుల లోతు నీరు ఉంది. చంద్రశేఖర్‌కి ఈత రావడంతో బావిలో ఉన్న చెట్ల వేర్లను పట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు.
 
అయితే బావిలో పడిన సమయంలో కాపాడాలంటూ కేకలు వేశాడు చంద్రశేఖర్, సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు. శుక్రవారం జీవన్ కుమార్ అనే వ్యక్తి పశువులు మేపుతూ బావి సమీపంలోకి వచ్చాడు. బావిలోంచి కేకలు వినిపించాయి. వెంటనే పోలీసులకు, స్థానిక గ్రామస్తులకు సమాచారం అందించాడు. 
 
పోలీసులు ఫైర్ సిబ్బందిని తీసుకోని బావిదగ్గరకు వచ్చి మూడు గంటలు శ్రమించి బావిలించి బయటకు తీశారు. తాను ప్రాణాలతో బయటపడాతానని అనుకోలేదన్న చంద్రశేఖర్‌.. తనను కాపాడిన జీవన్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో మరోసారి విజృంభిస్తున్న కరోనా: సెకండ్ వేవ్ ముప్పు తొలగిపోలేదు..!