Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అతనికి ఇసుకే ఆహారం... ఎక్కడ?

అతనికి ఇసుకే ఆహారం... ఎక్కడ?
, శనివారం, 22 ఫిబ్రవరి 2020 (11:47 IST)
ఆయన పేరు కోటేశ్వర రావు. సొంతూరు ప్రకాశం జిల్లా కలసపాడు గ్రామం. ఇతనికి ఆహారం కేవలం ఇసుక. రెండు దశాబ్దాలుగా ఇసుకే ఆహారం. మహాశివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం కర్నూలు జిల్లాలోని మహానందికి వచ్చిన ఆయన ఇసుక తింటూ కనిపించడంతో భక్తులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేశారు.
 
భక్తులు కొందరు చొరవ తీసుకుని ఇసుక ఎందుకు తింటున్నారని ప్రశ్నించారు. అందుకాయన బదులిస్తూ.. తన కోరిక నెరవేరితే ఇసుక తింటానని 20 ఏళ్ల క్రితం విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కుకున్నానని, కోరిక తీరడంతో అప్పటి నుంచి ఇసుక తింటున్నానని చెప్పుకొచ్చారు. భక్తులు ఎవరైనా దేవుడు ప్రసాదం ఇస్తే తింటానని, లేదంటే ఇసుకే తన ఆహారమని తెలిపారు.
 
కోటేశ్వరరావు ఇసుకను ఆహారంగా తీసుకుంటుండడంపై స్థానిక వైద్యుడు ఒకరు మాట్లాడుతూ, ఇసుకలో ఐరన్, కాల్షియం, మినరల్స్ ఉంటాయని చెప్పారు. రోజూ ఇసుకను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ అందుకు అనుగుణంగా మారుతుందని వివరించారు. ఇది చాలా అరుదైన ఘటనగా ఆయన అభివర్ణించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డోనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి విందు... కేసీఆర్‌కు ఆహ్వానం