Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లోనే నమాజ్ చేసి కరోనా కట్టడి చేద్దాం: మంత్రి పేర్ని నాని

ఇంట్లోనే నమాజ్ చేసి కరోనా కట్టడి చేద్దాం: మంత్రి పేర్ని నాని
, శుక్రవారం, 15 మే 2020 (21:59 IST)
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ రంజాన్ మాసంలో సర్వ మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని, రంజాన్ మాసంలో ఇంట్లోనే నమాజ్ చేసి కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ముస్లిం సోదరులను అభ్యర్ధించారు. 

శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మల్కా పట్నం పరిసర ప్రాంతంలో  లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న 250 మంది పేదలకు రంజాన్ తోఫా నేషనల్ గోల్డ్ బాషా  ఆధ్వర్యంలో మంత్రి పేర్ని నాని  చేతుల మీదుగా అందచేశారు.

ఈ నెలాఖరున జరిగే రంజాన్ పండుగ రోజున ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సంతోషంగా సేమియా చేసుకోవడానికి అవసరమయ్యే  సేమియా, నేతి ప్యాకెట్ , పంచదార , కిస్ మిస్ , జీడిపప్పు అందచేసిన బాషా మంచి మనస్సును అల్లా దీవిస్తారని మంత్రి పేర్ని నాని అన్నారు.

ఈ రంజాన్ తోఫా కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ అచ్చాబా , 19 వ వార్డు ఇంచార్జీ బూరుగ  రామారావు, షేక్ జిలాని బాషా, మాజీ కౌన్సిలర్ మేడికొండూరు మధు తదితరులు పాల్గొన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టైరిన్‌ పూర్తిగా తరలించాం: కరికాల వలవన్‌