Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరులో భారీగా అక్ర‌మ మ‌ద్యం స్వాధీనం

Advertiesment
illicit liquor
, శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:21 IST)
అక్రమ మద్యాన్ని అధిక మొత్తంలో స్వాధీనం చేసుకొని గుంటూరు రూరల్ పోలీసులు రికార్డ్ బ్రేక్ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎక్కడా లేనివిధంగా రూ.21,65,000 ల‌క్ష‌ల విలువైన 9,096 బాటిళ్ళను సీజ్ చేసి ఔరా అనిపించారు.

రవాణాకు ఉపయోగించిన వాటర్ ట్యాంకర్‌తో పాటు ఒక కారు, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని శనివారం గుంటూరులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్రమ మద్యం రవాణాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఆరుగురు వ్యక్తులు తెలంగాణా నుండి ట్యాంకర్ లో మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో రావడంతో తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని, ఈ క్రమంలో మునుగోడు గ్రామం వద్ద అమరావతి సీఐ టి.విజయకృష్ణ, ఎస్సై రవీంద్రబాబుతో పాటు వారి సిబ్బంది అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసి ఉపయోగించిన వాహనాలతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో పర్యాటక వాణిజ్యం అభివృద్ధికి మార్గదర్శకాలు జారీ