Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరులో గల్లా కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు

Advertiesment
land grabbing
విజయవాడ , గురువారం, 30 సెప్టెంబరు 2021 (17:27 IST)
మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు గల్లా రామచంద్రనాయుడుతో సహా 12 మందిపై భూ ఆక్ర‌మ‌ణ‌ కేసు నమోదు అయింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి  కోర్టులో ప్రైవేటు కేసు వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
దిగువ భాగానికి చెందిన రైతు గోపి కృష్ణకు చెందిన పొలాన్నిగల్లా కుటుంబం రాజన్న ట్రస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడిందంటూ రైతు కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన చిత్తూరు నాలుగో అదనపు కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పలు సెక్షన్ల కింద చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం