Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం

కరోనాతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం
విజయవాడ , గురువారం, 30 సెప్టెంబరు 2021 (17:17 IST)
సాటి హోం గార్డు క‌రోనాతో చ‌నిపోతే, జిల్లాలోని పోలీసు హోంగార్డులు అంతా స్పందించారు. అత‌ని కుటుంబానికి అండ‌గా నిలిచారు. అనంత‌పురం జిల్లాలో ఈ ఏడాది మే నెలలో కరోనాతో మృతి చెందిన హోం గార్డు టి.ఖాసీం సాహెబ్  ( హెచ్ జి నంబర్ 39) కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం అందించారు తోటి సిబ్బంది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో మృతుడి భార్య టి.హసీనాకు అందజేశారు.
 
 జిల్లా హోంగార్డులు ప్రతీ ఒక్కరూ తమ గౌరవ వేతనం నుండీ రూ. 600/- వితరణగా సహచర మృత కుటుంబానికి అందజేయడం అభినందనీయమని ఎస్పీ ఫ‌కీర‌ప్ప‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి రామకృష్ణ ప్రసాద్, హోంగార్డుల ఇన్ఛార్జి రిజర్వ్ ఇన్స్పెక్టర్ శివరాముడు, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెంగ్యూ వ్యాక్సిన్ కోసం ట్రయల్స్ : ఐసీఎంఆర్ డైరెక్టర్