Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఇద్దరినీ వేధించింది ఒక్కరే....

ఆ ఇద్దరినీ వేధించింది ఒక్కరే....
, బుధవారం, 15 మే 2019 (18:27 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి, సినీ నటి పూనంకౌర్‌లు సోషల్ మీడియాలో తమను వేధింపులకు గురి చేస్తున్నారని గతంలో వారిద్దరూ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు ప్రముఖుల్ని సోషల్ మీడియాలో వేధించింది ఒక్కడే అన్న విషయాన్ని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
 
కొందరు వ్యక్తులు తమ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అశ్లీల కథనాలు, అసభ్య రాతలతో పోస్ట్ చేస్తున్నారని వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇరువురిని వేధింపులకు గురి చేసింది ఒక్కరేనన్న విషయాన్ని గుర్తించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఈ పనిలో మరో వ్యక్తి కూడా పాలుపంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. 
 
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఒక అపార్ట్‌‌మెంట్‌లో వారిద్దరూ ఒక ఆఫీసును నిర్వహిస్తున్నారని తేలింది. వారిద్దరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యరాతలు రాయడానికి కారణం నిందితులను పట్టుకుంటే గానీ తెలియదని చెప్పారు. డబ్బు కోసం చేసారా లేక వ్యక్తిగత కక్షతో ఇలాంటి పని చేసారా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిడ్స్ ఉందని చెప్పినా విడిచిపెట్టని కామాంధుడు... ఆస్పత్రి డాబాపై రేప్