Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ‌న‌సేన ఉపాధ్య‌క్షుడిగా కిర‌ణ్ కుమార్ రెడ్డి... 23న చేరిక‌?

హైద‌రాబాద్ : ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న జ‌నసేన‌ను విస్త‌రిస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఒక్క‌డుగా మిగిలిన ప‌వ‌న్... ఇపుడు పార్టీని క్ర‌మేపీ విస్త‌రించే ప‌నిలో ప‌డ్డారు. పార్టీకి ప్ర‌చార కార్య‌ద‌ర్శి, ఇత‌ర సిబ్బందిని స‌మ‌కూర్చిన ప‌వ‌న్.. ఇపుడు పార్టీ ఉపా

Advertiesment
Kirankumar Reddy
, బుధవారం, 16 నవంబరు 2016 (13:41 IST)
హైద‌రాబాద్ : ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న జ‌నసేన‌ను విస్త‌రిస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఒక్క‌డుగా మిగిలిన ప‌వ‌న్... ఇపుడు పార్టీని క్ర‌మేపీ విస్త‌రించే ప‌నిలో ప‌డ్డారు. పార్టీకి ప్ర‌చార కార్య‌ద‌ర్శి, ఇత‌ర సిబ్బందిని స‌మ‌కూర్చిన ప‌వ‌న్.. ఇపుడు పార్టీ ఉపాధ్య‌క్ష ప‌ద‌విని మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డికి క‌ట్ట‌బెడుతున్న‌ట్లు స‌మాచారం. 
 
తాను జ‌న‌సేన‌కు వెళుతున్న‌ట్లు కిర‌ణ్ త‌న స‌న్నిహితుల‌తో ఎప్పుడో చెప్పారు. అయితే దీనికి ముహూర్తం ఈ నెల 23న పెట్టారు. మాజీ సీఎం జనసేన పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయినట్టు సమాచారం. జనసేన పార్టీ ఉపాధ్యక్ష పదవిని ఈ చేరిక స‌భ‌లో ప్ర‌క‌టిస్తార‌ని భావిస్తున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం త‌న అనుచరులతో ఓ సభ ఏర్పాటు చేస్తార‌ట‌. త‌ను జ‌న‌సేన‌లో చేరడం మాత్రం పవన్ కళ్యాణ్ ఇంటి వద్దే అని నిర్ణయించిన‌ట్లు స‌మాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైట్ మనీ లేదు... బ్లాక్ మనీ బిగుసుకుపోయింది... బెజ‌వాడ‌లో రియ‌ల్ బూమ్ ఢమాల్...