Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేశినేని నాని వర్సెస్ బోండా ఉమ, విజయవాడ తెదేపాలో ఏం జరుగుతోంది?

Advertiesment
Kesineni Nani
, శనివారం, 6 మార్చి 2021 (14:06 IST)
కృష్ణా జిల్లా అర్బన్ టీడీపీలో ముసలం పుట్టింది. గెలుపు ఓటములు పక్కకు నెట్టి పంతం నెగ్గించుకునే పనిలో అర్బన్ తెలుగు తమ్ముళ్లు కొట్టుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్సెస్ విజయవాడ ఎంపీగా పర్యటనలు సాగుతున్నాయి. 
 
సొంత పార్టీలో ముసలంపై అటు పార్టీలో ఇటు అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. విజ‌య‌వాడ తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు రేగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేశినేని నానిపై బోండా ఉమా, బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరాలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. 
 
చంద్ర‌బాబు రోడ్‌షోలో కేశినేని పాల్గొంటే మేము పాల్గొన‌బోం అంటు తెగేసి చెపుతున్నారు. మాకు అధిష్టానం చంద్ర‌బాబు త‌ప్ప ఎంపీ కేశినేని నాని కాదు. కేశినేని నానీలాగా చీక‌టి రాజ‌కీయాలు తాము చేయం. పార్టీ కోసం ప్రాణాల‌ను కూడా ప‌ణంగా పెట్టాం. దీనికి ప్రధాన కారణం అధినేత చంద్ర‌బాబు రోడ్‌షోనే.
 
రోడ్ షో మ్యాప్ విషయంలో ఎంపీ కేశినేని నానీ మార్పులు చేయటంతోనే తెలుగుదేశం నేత‌లు తిరుగుబావుటా ఎగురవేస్తున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జార్జ్‌ ముత్తూట్‌ దుర్మరణం: మెట్లపై నుంచి జారి పడటంతో కన్నుమూత