Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెడతా - బిజెపి అధ్యక్షుడు కన్నా

ఎపి ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు..టిడిపి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు ఎపిలో చేసిన అభివృద్థికి నిధులు సగానికిపైగా ఇచ్చింది

Advertiesment
Kanna Lakshmi Narayana
, శుక్రవారం, 6 జులై 2018 (21:01 IST)
ఎపి ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు..టిడిపి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు ఎపిలో చేసిన అభివృద్థికి నిధులు సగానికిపైగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని చెప్పారాయన. కేంద్రం నిధులు ఇచ్చినా ఏమీ ఇవ్వలేదంటూ టిడిపి నేతలు చెబుతుండడం మంచిది కాదన్నారు. అందుకే నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామని చెప్పారు.
 
నాలుగేళ్ళలో ఖాళీగా కనిపించిన భూములను తెలుగు తమ్ముళ్ళు దర్జాగా కబ్జా చేసేశారని, వాటిని చంద్రబాబునాయుడు ప్రోత్సహించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎపిలో బిజెపి విజయం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాలుగు సంవత్సరాల పాలన, అమలు చేసిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు సఫలీకృతులయ్యారన్నారు కన్నా లక్ష్మీనారాయణ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త ఇంట్లో వుండగానే బోయ్ ఫ్రెండ్‌తో శృంగారం... తల్లిదండ్రులకే దొరికిపోయిన మహిళ....