Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌కు ఆఫర్.. జనసేనను మా పార్టీతో కలిపేయండి.. ఎవరు?

Advertiesment
Pawan kalyan
, శనివారం, 29 ఏప్రియల్ 2023 (08:02 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేస్తూనే పవన్‌కు ఆఫర్ ఇచ్చారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ తనతో వస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. 
 
తన జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని పవన్ కళ్యాణ్‌ను కేఏ పాల్ కోరారు. వన్ మళ్లీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తనతో పాటు పవన్ పోరాటానికి దిగాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికే తన వెంట సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, గద్దర్ వచ్చారని, వారిలాగే పవన్ కూడా వచ్చి చేతులు కలపాలని కోరారు. విశాఖ ఉక్కు కోసం కలిసి పోరాడుదాం సోదరా రండి అని పిలుపునిచ్చారు. 
 
విశాఖ ఉక్కును కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెడతానన్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ప్రాజెక్టుపై తాను పిల్‌ దాఖలు చేశానని, గతంలో వేసిన పిల్‌తో ఈ పిల్‌కు సంబంధం లేదని పాల్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయం గురించి మాట్లాడాలని వుంది.. కానీ, వద్దురా రజనీ అని అనుభవం ఆపుతోంది.. తలైవా