Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీకి 'హోదా' ఇవ్వరాదని బీజేపీ నిర్ణయం.. మనం ఎంత మొత్తుకున్నా రాదు: జేసీ దివాకర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని భారతీయ జనతా పార్టీ గట్టి నిర్ణయం తీసుకుందని, అందువల్ల ఇపుడు మనం ఎన్ని చెప్పినా.. ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ

ఏపీకి 'హోదా' ఇవ్వరాదని బీజేపీ నిర్ణయం.. మనం ఎంత మొత్తుకున్నా రాదు: జేసీ దివాకర్
, శుక్రవారం, 5 ఆగస్టు 2016 (19:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని భారతీయ జనతా పార్టీ గట్టి నిర్ణయం తీసుకుందని, అందువల్ల ఇపుడు మనం ఎన్ని చెప్పినా.. ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే ఉద్దేశంలో బీజేపీ లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసేసుకుందన్నారు. అందువల్ల మనం ఎన్ని చెప్పినా, ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదన్నారు. 
 
కేంద్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉండేలా కనిపిస్తోందని మోడీతో భేటీ అనంతరం వ్యాఖ్యానించిన ఆయన, ఏపీ సమస్యను మిగతా రాష్ట్రాల సమస్యలతో పోల్చి చూడవద్దని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఏపీ నష్టపోయిందని ఆయనకు మరోసారి గుర్తు చేశామని, అన్నీ తనకు తెలుసునని, ఆదుకుంటామని మాత్రమే మోడీ హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పని చేస్తున్న దేశాధ్యక్షుడి కుమార్తె ఎవరు?