Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్ర‌త్యేక విమానంలో బెంగ‌ళూరుకు చేరుకున్న జ‌వాన్ సాయితేజ మృత‌దేహం

ప్ర‌త్యేక విమానంలో బెంగ‌ళూరుకు చేరుకున్న జ‌వాన్ సాయితేజ మృత‌దేహం
విజ‌య‌వాడ‌ , శనివారం, 11 డిశెంబరు 2021 (16:38 IST)
తమిళనాడు కున్నూరు సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం  చెందిన చిత్తూరు జిల్లా కురబలకొట మండలం రేగడ పల్లెకు చెందిన వీర జవాన్  సాయితేజ మృత దేహం క‌ర్నాట‌కు చేరుకుంది. బెంగ‌ళూరు ఎయిర్ బేస్ క్యాంపున‌కు ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ నుంచి జ‌వాన్ సాయితేజ మృత‌దేహం చేరుకుంది. సైనిక లాంఛ‌నాల‌తో మృత‌దేహాన్ని బెంగ‌ళూర్ బేస్ క్యాంప్ లోని మార్చురీకి త‌ర‌లించారు. రేపు ఉదయం చిత్తూరు జిల్లా కురబలకోట (మ) ఎగువరేగడు గ్రామంలో కుటుంబ సభ్యులకు సాయితేజ పార్థివ దేహం అప్పగించ‌నున్నారు.
 
 
వీర జవాన్  సాయితేజ మృత దేహం ఆదివారం ఉదయం వారి  స్వగ్రామానికి చేరుకుంటుందని, చిత్తూరు   జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. ఆదివారం రేగడపల్లెలో అధికార లాంఛనాలతో దహన క్రియలు జరుగుతాయ‌ని ఆయ‌న తెలిపారు. బెంగ‌ళూరు నుంచి ఉద‌యం ఇక్క‌డికి మృత‌దేహం చేరుతుంద‌ని చెప్పారు. రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జ‌రుగుతాయ‌ని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ హత్యకు కుట్ర జరుగుతోంది: వైసిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు