Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప‌వ‌ర్ స్టార్ ఇక ప్ర‌త్య‌క్ష‌పోరాటాల‌కు... నెల‌ఖ‌రులో చ‌ర్చ‌!

Advertiesment
janasena
విజయవాడ , శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (10:40 IST)
రాష్ట్రంలో దాష్టీక పాలన జరుగుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వర్చువల్ ద్వారా ఆయన మాట్లాడుతూ, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు అని అన్నారు. వైసిపి అరాచకాలకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో పోరాటాలకు జనసేన సిద్ధం అవుతుందని వెల్లడించారు. 
 
ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్ ఎన్నికల్లో జనసేన బలంగా పొరాడిందని, తద్వారా 25.2% ఓట్లు సాధించాం అని పేర్కొన్నారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ వైసీపీ అరాచకాలు చేస్తుంటే, అధికార యంత్రాంగం చోద్యం చూసింది అని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
 
 దాడులు, బెదిరింపులతో వైసిపి నేతలు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నార‌ని ప‌వ‌న్ విమర్శించారు. వైసిపి దాష్టిక పాలనను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసిపి దాడులను ఎలా ఎదుర్కోవాలి? క్షేత్ర స్థాయి పోరాటాలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో తమ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరెలా చస్తే నాకేంటి? అనే టైప్ ముఖ్యమంత్రి జగన్