Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16 నుంచి విశాఖలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు

16 నుంచి విశాఖలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు
, మంగళవారం, 10 డిశెంబరు 2019 (07:04 IST)
విశాఖ సాగర తీరం అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలకు మరోసారి వేదిక కాబోతోంది. ఈనెల 16 నుంచి ఆర్కే బీచ్​లో పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు తెలిపారు.

విశాఖలో ఈనెల 16 నుంచి ఆర్కే బీచ్​లో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఏవీసీ బీచ్ వాలీ బాల్ కాంటినెంటల్ కప్ పేరిట ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ పోటీల్లో ఆసియా దేశాలైన ఇరాన్, కజికిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్, భారత్ నుంచి క్రీడా జట్లు పాల్గొంటాయని తెలిపారు. గతంలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు విశాఖలో జరిగినా.. ఈసారి జరగనున్న పోటీలకు ప్రత్యేకత ఉందన్నారు.

ఇక్కడ విజేత జట్లు ఆసియా స్థాయిలో మరో మెగా టోర్నీలో పాల్గొంటాయని అక్కడ ప్రతిభ కనబరిస్తే రాబోయే ఒలింపిక్స్​లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాయన్నారు. ఈ పోటీలను తిలకించేందుకు నగరవాసులకు ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యుత్తు వినియోగ చార్జీల బకాయిలు సకాలంలో చెల్లించాలి: సీఎస్ ఆదేశం