Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెల్లూరులో 17మంది టీచర్లు, 10మంది పిల్లలకు వైరస్‌

నెల్లూరులో 17మంది టీచర్లు, 10మంది పిల్లలకు వైరస్‌
, శుక్రవారం, 27 ఆగస్టు 2021 (06:24 IST)
పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు కూడా గడవక ముందే పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మహమ్మారి బారినపడ్డారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8మంది టీచర్లకు, ఐదుగురు విద్యార్థులకు పరీక్షలు చేయగా అందరికీ పాజిటివ్‌గా తేలింది.

అలాగే 13 మంది టీచర్లలో 9మందికి, 35మంది పిల్లల్లో ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ నెల 22న డక్కిలి మండలంలో ఓ ఉపాధ్యాయుడు కరోనా నుంచి కోలుకోలేక మృతిచెందాడు.

కాగా, పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి జడ్పీ హైస్కూల్‌లోని ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. ఏడు, తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థులకు జ్వర లక్షణాలు ఉండటంతో తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి అకౌంటెంట్‌ జనరల్‌ లేఖాస్త్రాలు.. ఎందుకో తెలుసా?