Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమాచారం లీక్ చేస్తున్నారంటూ ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురిపై వేటు

సమాచారం లీక్ చేస్తున్నారంటూ ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురిపై వేటు
, బుధవారం, 4 ఆగస్టు 2021 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తాఖీదు నోటీసులు జారీచేసింది. కాగ్ కూడా ఏపీ వైఖరిని తూర్పారబట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వీరిలో ఇద్దరు సెక్షన్‌ ఆఫీసర్లు, ఒక సహాయ కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
ఆర్థికశాఖలో సెక్షన్‌ అధికారులుగా పనిచేస్తున్న డి.శ్రీనుబాబు, కె.వరప్రసాద్‌, సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖలోని సమాచారం లీక్‌ చేస్తున్నారనే అభియోగంపై ప్రభుత్వం వారిని సస్పెండ్‌ చేసింది. వేటు పడిన ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాహనదారులపై ఉక్కుపాదం : ఒక్క చలానా ఉన్నా సీజ్‌