Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనుషులను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు..

Advertiesment
మనుషులను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు..
, బుధవారం, 20 మార్చి 2019 (16:14 IST)
మీరు గతేడాది నాని నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని చూసారా? ఆ చిత్రంలో ఇద్దరు హీరోయిన్‌లను ఓ ముఠా విదేశాలకు తరలిస్తుంటారు. హీరోలు ఎలాగోలా వారిని రక్షిస్తారు. ఇప్పుడు ఇటువంటి సన్నివేశం ఒకటి జరిగింది. ఇక్కడ కూడా మనుషులను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. 
 
17మంది సభ్యులు ఉన్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి 200 పాస్‌పోస్ట్‌లు, నకిలీ వీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 14 కేసులు నమోదు చేసామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే 71 మందిని అరెస్టు చేసినట్లు, మరో 21 మంది పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. వీరందరూ నకిలీ విదేశీ వీసాలు సృష్టించి మోసాలు చేస్తున్నారు.
 
దేశవ్యాప్తంగా కూడా ఈ నకిలీ వీసా దందా నడుస్తోంది. ఈ ముఠాకు ముంబైలోని ఓ రిజిస్టర్ ఏజెంట్‌తో లింకులు ఉన్నాయి. అంతేకాకుండా చేవెళ్ల నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఇప్పించారని, వీరికి కానిస్టేబుల్ మధు సహకరించారని సీపీ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షియోమీ వాషింగ్ మెషీన్ వచ్చేస్తోంది.. దిగ్గజాలకు షాక్ తప్పదా?