Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపా రెచ్చగొడుతుందమ్మా.. ఎవరూ ఆవేశానికి గురికావొద్దమ్మా..!: చినబాబు ట్వీట్

Advertiesment
I request our cadre not to resort to extremes and maintain restraint. Let's focus our energies on development of the state
, ఆదివారం, 5 జూన్ 2016 (18:06 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు గుప్పించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా వైఖరిపై చినబాబు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. టీడీపీ శ్రేణులకు తన సందేశాన్ని పంపారు. వైకాపా పార్టీ రాష్ట్ర వ్యతిరేకి అని.. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. 
 
వైకాపా రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందని.. ఇందుకు అనంతలో జగన్ పర్యటన సందర్భంగా ఆయన చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. కాబట్టి ఎవ్వరూ ఆవేశానికి లోనుకావద్దొని పిలుపునిచ్చారు. మన శక్తియుక్తులన్నిటినీ రాష్ట్ర అభివృద్ధి కోసమే వినియోగిద్దామని లోకేశ్ సూచించారు. 
 
ఇకపోతే.. అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఓబులదేవరచెర్వు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి స్థానికులని ఉద్దేశించి ప్రసంగించిన జగన్... చంద్రబాబుకి చెప్పులు చూపించడం ఇష్టంలేకపోవడంతో..ఈసారి చెప్పులకు బదులు చీపుర్లు చూపించండని వెల్లడించారు. ఇప్పటికే జగన్ చేసిన చెప్పు వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోతున్న టీడీపీ శ్రేణులు, తాజాగా చీపుర్ల వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహం ఎదురుగా నిలబడి పిలిచిన బాలుడు.. వేటకు దూకింది.. ఆపై ఏమైంది? (వీడియో)