Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం కోసం కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టేసిన తల్లి.. హైటెక్ నగరంలో..?

మద్యం కోసం కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టేసిన తల్లి.. హైటెక్ నగరంలో..?
, శుక్రవారం, 14 ఆగస్టు 2020 (09:39 IST)
పేగు బంధాన్నే అమ్మకానికి పెట్టింది ఓ తల్లి. కన్నబిడ్డను మద్యం కోసం అమ్మకానికి పెట్టింది ఓ కనికరంలేని తల్లి. ఈ సంఘటన హైదరాబాద్ మహానగరంలో జరిగింది. రెండు నెలల క్రితం జన్మనిచ్చిన బాబును రూ.45 వేలకు అమ్మకానికి పెట్టింది. దీంతో పోలీసులు పక్కా సమాచారంతో కేసును ఛేదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ఎంఎస్‌ మక్తాకు చెందిన అబ్దుల్‌ ముజాహిద్‌, షేక్‌ జోహాఖాన్‌ దంపతులు ఇటీవల హబీబ్‌నగర్‌ పరిధిలోని సుభాన్‌పురాకు మకాం మార్చారు. వీరికి రెండు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. మద్యం తాగే అలవాటున్న జోహాఖాన్ ఆమె భర్తతో తరుచు గొడవ జరిగేది. ఈనెల 3న ముజాహిద్‌ బంధువుల ఇంటికి వెళ్లాడు. 8వ తేదీన తిరిగి ఇంటికి రాగా కొడుకు కనిపించలేదు. భార్యను నిలదీయగా సుభాన్‌పురాకు చెందిన షేక్‌ మహమ్మద్‌(30), తబస్సుం (25)లకు రూ.45వేలకు అమ్మేసినట్లు భార్య ఒప్పుకుంది.
 
తన కొడుకును వెంటనే ఇవ్వాలని ముజాహిద్‌ కోరినా వారు అంగీకరించకపోవడంతో ముజాహిద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చంచల్‌గూడకు చెందిన ఆయేషా జబీన్‌(28)కి సంతానం లేకపోవడంతో.. అదే ప్రాంతానికి చెందిన షేక్‌ మహమ్మద్‌, తబస్సుంల ద్వారా బాబు(2 నెలలు) విషయం తెలుసుకుంది. 
 
డబ్బులు చెల్లించి ఆయేషా జబీన్ పిల్లాడిని తీసేసుకుంది. కాగా, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయేషా ఇంటిపై దాడి చేసి బాబును తీసుకుని తండ్రికి అప్పగించారు. ఆయేషా జబీన్‌, జోహాఖాన్‌, షేక్‌ మహమ్మద్‌, తబస్సుం, షమీమ్‌ బేగం, సిరాజ్‌ బేగంలను అరెస్టు చేశారు. కేసును ఛేదించిన పోలీసులను ఏసీపీ అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ కోర్ల‌లోంచి మంగ‌ళ‌గిరిని ర‌క్షించండి: నారా లోకేశ్