Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది.. భర్త ఎలా కనుగొన్నాడో తెలుసా?

ఆధునికత పెరుగుతున్న కొద్దీ.. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో ఒకరినొకరు మోసం చేసుకునే దంపతుల సంఖ్య పెరగిపోతుంది. దీంతో నేరాలు కూడా పెరుగుతున్

ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది.. భర్త ఎలా కనుగొన్నాడో తెలుసా?
, బుధవారం, 27 జూన్ 2018 (12:50 IST)
ఆధునికత పెరుగుతున్న కొద్దీ.. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో ఒకరినొకరు మోసం చేసుకునే దంపతుల సంఖ్య పెరగిపోతుంది. దీంతో నేరాలు కూడా పెరుగుతున్నాయి.


తాజాగా తనకన్నా పదేళ్లు చిన్నవాడైన అవివాహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ప్రియుడితో కలసి గోవాకు వెళ్లగా, జీపీఎస్ సాయంతో ఆమె భర్త గుర్తించాడు. అంతటితో ఆగకుండా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి తరచూ క్యాంపుల నిమిత్తం బయటి ప్రాంతాలకు వెళ్తుండేవాడు. అతని వ్యాపారాలను భార్య చూసేది. ఈ క్రమంలో కారును వాషింగ్‌కు తీసుకెళ్లిన ఆమెకు షాపు యజమాని మాధవ్ పరిచయం అయ్యాడు. తనకన్నా పదేళ్లు చిన్నవాడైన మాధవ్‌తో ఆమె వివాహేతర బంధం ఏర్పడింది. వీరిద్దరూ ఇంట్లో రహస్యంగా కలవడం చూసిన భర్త ఆమెను హెచ్చరించాడు. ఆ సమయంలో క్షమించమని కోరిన భార్య.. పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి.. ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. 
 
అనుమానం వచ్చిన భర్త, ఆమె కారులో జీపీఎస్ పరికరాన్ని అమర్చాడు. వారు ఎక్కడున్నారో కనుగొన్నాడు. దీంతో భార్యతో వివాహేతర సంబంధం కొనసాగించిన వ్యాపారి, భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకా భార్య వద్ద తన కుమార్తెలను వుంచకూడదని.. తనకు అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ సీఎం 'నల్లారి' రీ ఎంట్రీ ఖాయం!