Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాదులో దారుణం.. మహిళను హత్యచేసి.. ప్లాస్టిక్ బ్యాగులో..?

హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. పాతబస్తీలో మహిళ దారుణంగా హత్యకు గురైయ్యారు. ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. వివరాల్లోకి వెళితే.. డబీర్ పూర్ స్టేషన్‌కు కొంచెం దూరంలో మహిళ మృత

హైదరాబాదులో దారుణం.. మహిళను హత్యచేసి.. ప్లాస్టిక్ బ్యాగులో..?
, సోమవారం, 21 మే 2018 (09:05 IST)
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. పాతబస్తీలో మహిళ దారుణంగా హత్యకు గురైయ్యారు. ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. వివరాల్లోకి వెళితే.. డబీర్ పూర్ స్టేషన్‌కు కొంచెం దూరంలో మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మహిళను హత్య చేసి.. ఆ శరీరానికి బురఖా వేసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచారు. ఆపై ఆ బ్యాగ్‌ని బియ్యపు సంచిలో పెట్టారు.
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, మహిళ హత్యకు గురై రెండు రోజులైందని, గుర్తుతెలియని వ్యక్తులు పక్కా పథకంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. 
 
మరోవైపు సిద్ధిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం శనిగారం వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రేమవివాహం చేసుకున్న కాసేపటికే దంపతులు పురుగుల మందు తాగారు. గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి అంజలి మృతి చెందగా, యువకుడు లోహిత్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో మొన్న కుక్క ఎలుగుబంటి ఐతే.. నేడు కుక్క నక్కగా మారిపోయింది..?