Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలుడు చేతులు విరగ్గొట్టి ముళ్ళ పొదల్లో పడేశారు...

బాలుడు చేతులు విరగ్గొట్టి ముళ్ళ పొదల్లో పడేశారు...
, బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (09:17 IST)
ఇటీవలి కాలంలో నేరాలు ఘోరాలకు భాగ్యనగరం అడ్డాగా మారిపోతోంది. ఈ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఓ బాలుడుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు చేతులు విరగ్గొట్టి ముళ్ళపొదల్లో పడేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ రెయిన్‌బజార్ పరిధిలోని యాకుత్‌పురాకు చెందిన ఆరేళ్ళ బాలుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతని రెండు చేతులు విరగ్గొట్టి ఆ బాలుడిని ముళ్లపొదల్లో పడేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. 
 
ఆ తర్వాత తమ కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. గాలించగా, ఆ బాలుడు ముళ్లపొదల్లో ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బాలుడి కిడ్నాప్ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా లేదంటే ఇది భిక్షగాళ్ళ మాఫియా ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చివరి విమానం తిరిగొచ్చేవరకూ నిద్రపోని మోదీ... పాక్ పైన ఆస్ట్రేలియా కన్నెర్ర