Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్నెల్లుగా అనుమాన.. చెల్లితో కలిసి చర్చికి వెళ్లొస్తున్న భార్యపై దాడి

ఆర్నెల్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ, సత్యనారాయణ పురంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Advertiesment
Husband
, బుధవారం, 27 జులై 2016 (11:35 IST)
ఆర్నెల్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడ, సత్యనారాయణ పురంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... పెజ్జోనిపేట డేవిడ్‌ వీధిలో నివసించే తెజశ్వని(22)ని స్థానికంగా కారు డ్రైవర్‌గా ఉన్న కె మహేష్‌ను ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకుంది. అయితే, ఆర్నెల్లపాటు సజావుగా సాగిన వారి కాపురంలో అనుమానం పెనుభూతమైంది. 
 
భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీన తల్లి విజయకుమారి, చెల్లితో కలిసి పెజ్జోనిపేటలోని బాప్టిస్టు చర్చికి వెళ్లింది. ప్రార్థనలు ముగించుకుని 11 గంటలకు ఇంటికి వస్తుండగా పెజ్జోనిపేట సీకే రెడ్డి రోడ్డులోకి వచ్చేసరికి భర్త కొబ్బరి బోండాలు నరికే కత్తితో తేజశ్వనిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మెడపైన, వీపు భాగం, చేతికి గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు మంగళవారం మహేష్‌ను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... ఆ డీటైల్స్ రాంగ్ నెంబర్‌కి పంపింది.. ఆపై ఏమైంది?