Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ - ఏలూరులో మనిషికి వైరస్ సోకింది!!

Advertiesment
birdflu

ఠాగూర్

, గురువారం, 13 ఫిబ్రవరి 2025 (13:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్టు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ఉంగుటూరు మండల పరిధిలోని కోళ్లఫారం సమీపంలో ఉంటున్న ఓ వ్యక్తికి ఈ ఫ్లూ సోకినట్టు తేలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా వైద్యశిబిరాన్ని నిర్వహించి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపిస్తున్నారు. ఏపీలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌కు సంబంధించిన తొలి కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, గత కొన్ని రోజులుగా ఉభయగోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్ర ఎక్కువగా ఉంది. కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు ఇప్పటికే నిర్ధారణ కాగా, ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 50 లక్షలకు పై కోళ్లు ఈ ఫ్లూ వైరస్ కారణంగా చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. 
 
అందువల్ల చికెన్ మాంసానికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. ఒకవైపు అధికారుల హెచ్చరికలు, మరోవైపు బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియాలో హెచ్చరికల నేపథ్యంలో చికెన్ కొనుగోళ్ళు తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫలితంగా కేజీ చికెన్ రూ.30కే లభ్యమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్యాటకులకు శుభవార్త : చెన్నై - విశాఖ - పుదుచ్చేరిల మధ్య క్రూయిజ్ నౌక