Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నూలులో హైకోర్టు కాదు.. హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తాం : నారా లోకేశ్

nara lokesh
, సోమవారం, 8 మే 2023 (11:35 IST)
2024లో జరిగే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు కాదని హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఆయన యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో భాగంగా, కర్నూరులోని జిల్లా కోర్టు భవనం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు న్యాయవాదులు కలుసుకుని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. 
 
వారితో నారా లోకేష్ ముచ్చటిస్తూ, తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తమది సీఎం జగన్‌ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్‌ కాదన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం స్పష్టం చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే బెంచ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. హైకోర్టు బెంచ్‌ హామీపై లోకేశ్‌కు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటిన ఆరో తరగతి విద్యార్థిని