Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువగళం పాదయాత్రలో బాలకృష్ణ-పూలవర్షం కురిపించి స్వాగతం

balakrishna
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (16:45 IST)
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నందమూరి బాలకృష్ణతో కలిసి యువగళం పాదయాత్ర సాగింది. ఇద్దరు రాజకీయ ప్రముఖులను కలిసి చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. 
 
బాలకృష్ణ క్యాప్ ధరించి యాత్రలో ఉత్సాహంగా పాల్గొని ఉత్సాహం నింపారు. వారితో సెల్ఫీలు దిగేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం చూపారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్- బాలకృష్ణ ఇద్దరూ డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 
 
పాదయాత్రకు ముందు బాలకృష్ణకు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. యువగళం పాదయాత్ర సాగుతున్న కొద్దీ టీడీపీ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హుస్నాబాద్‌‌లో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి