Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీటీడీ రిటైర్డ్ జేఈవో ల‌క్ష్మీకాంతంకు హీరో ఆఫ్ సొసైటీ అవార్డు అవార్డు

టీటీడీ రిటైర్డ్ జేఈవో ల‌క్ష్మీకాంతంకు హీరో ఆఫ్ సొసైటీ అవార్డు అవార్డు
, సోమవారం, 9 ఆగస్టు 2021 (11:39 IST)
మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ రిటైర్డ్ జేఈవో బి.లక్ష్మీకాంత్‌కు హీరో ఆఫ్ సొసైటీ అవార్డు ప్రదానం చేశారు. కృష్ణ జిల్లా పూర్వపు కలెక్టర్‌గా ప‌నిచేసి, తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా రిటైర్ అయిన లక్ష్మీకాంత్‌కు న్యూఢిల్లీకి చెందిన నవ్య సర్జన్ సంస్థ ఈ అవార్డును ప్ర‌క‌టించింది. న్యూఢిల్లీలోని ఈస్ట్ కైలాష్‌లో ఇస్కాన్ ఆడిటోరియంలో ఈషాస్ సెకండ్ ఛాన్స్ పేరిట జరిగే ఆర్గాన్ డోనేషన్ ఫ్యాషన్ షోలో ఆ సంస్థ ఫౌండర్ కంచన్ సింగ్, చైర్ పర్సన్ రంజిత్ కుమార్ హీరో ఆఫ్ సొసైటీ అవార్డును ప్రదానం చేశారు,
 
న్యూఢిల్లీకి చెందిన నవ్య సర్జన్ సంస్థ ఆధ్వర్యంలో ఆయన హీరో ఆఫ్ సొసైటీ అవార్డు అందుకున్నందుకు బి.లక్ష్మీకాంత్‌ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. స‌మాజానికి సేవ చేసిన వారికి త‌గిన గుర్తింపు ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని, ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు నిరంత‌రం కొన‌సాగాల‌ని లక్ష్మీ కాంతం ఆకాంక్షించారు. తాను ప‌ద‌వీ విర‌మ‌ణ చేసినా, ఏపీలో స‌మాజ సేవ‌లో ముఖ్య భూమిక పోషిస్తున్నాన‌ని, అక్క‌డి ప్ర‌భుత్వం కూడా త‌న సేవ‌ల్ని వినియోగించుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింద‌ని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్సో - మిజోరం సరిహద్దు రచ్చ : ప్రధాని మోడీతో హిమంత్ బిశ్వా