Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తరలిస్తున్నారా? కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తరలిస్తున్నారా? కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ఏంటి?
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులోభాగంగా, హైకోర్టును కర్నూలుకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదలను కేంద్రానికి కూడా పంపారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. 
 
ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో బీజేపీకి చెందిన సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రస్తావన తీసుకువచ్చారు. అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా? అని జీవీఎల్ ప్రశ్నించగా, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బదులిచ్చారు.
 
ఏపీ హైకోర్టు తరలింపుపై 2020 ఫిబ్రవరిలో సీఎం జగన్ నుంచి తమకు ప్రతిపాదనలు అందాయని వెల్లడించారు. అమరావతి నుంచి కర్నూలు తరలింపు అంశంలో హైకోర్టు, ఏపీ సర్కారుదే తుది నిర్ణయం అని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 
 
తరలింపుపై హైకోర్టు, ఏపీ ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరిగిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. అందుకు ఏకాభిప్రాయం ముఖ్యమని తెలిపారు. హైకోర్టును కర్నూలు తరలించే విషయంలో నిర్దేశిత గడువు అంటూ ఏమీ లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. సరిగ్గా చెప్పాలంటే కర్నూలు తరలింపు అంశం ఏపీ హైకోర్టు పరిధిలోనే ఉందని స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాకేష్ తికాయత్ ఎంతకైన దిగజారుతారు : బీజేపీ ఎమ్మెల్యే