Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలీస్, ప్రెస్ అని వాహనాల‌పై రాసి ఉంటే... కేసు నమోదు

Advertiesment
guntur
విజయవాడ , శనివారం, 11 సెప్టెంబరు 2021 (10:37 IST)
ప్ర‌తి వాడూ బండిపైన పోలీస్ అని, ప్రెస్ అని రాసేసి, విచ్చ‌ల‌విడిగా రోడ్ల‌పై తిరుగుతున్నారు. అందుకే గుంటూరు పోలీసులు ఈ నిర్ణ‌యానికి వ‌చ్చారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గుంటూరు అర్బన్ పోలీసులు వాహన తనిఖీల భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ఎవ‌రైనా అర్హ‌త లేని వారు ప్రెస్ అని, పోలీస్ అని బండిపై రాస్తే, వారిని ఆపి విచారించారు. కొంతమంది వాహనాలపై పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేని వ్యక్తులు, మీడియా కు సంబంధం లేని వ్యక్తులు వారి వాహనాలపై పోలీస్,  ప్రెస్ మీడియా అని రాసుకొని  తిరుగుతున్నారు.  అర్బన్ పోలీసులు ఆ వాహనాలను ఆపి, క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని, డిపార్ట్మెంట్ కు సంబంధంచని పోలీస్ స్టిక్కర్ ఉన్న 20 టూ వీలర్స్ పై  పోలీస్ కేసు నమోదు చేశారు. అలానే మీడియా సంబంధం లేని 16 మంది  ప్రెస్ స్టిక్కర్  కలిగి ఉన్న వాహనాలపై కేసు నమోదు చేశారు. 
 
నగర ప్రజలందరూ ఇది గమనించి, పోలీసు ఉద్యోగి కాకుండా వాహనంపై పోలీస్ అని  రాసుకున్నట్లు అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. అలానే మీడియా అంటూ సంబంధిత అధికారుల అర్హత కార్డు లేకుండా, ఎవరైతే వాహనాలపై ప్రైస్ అని కానీ, లేక మీడియా అని కానీ రాసుకొని తిరుగుతుంటే, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామ‌ని గుంటూరు అర్బన్ ఉన్నత పోలీసు అధికారులు తెలియజేశారు.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

9/11 దాడులు జరిగి నేటికి 19 ఏళ్లు: 3,000 మంది మృతి