Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ ఫ్యాకల్టీగా గుంటూరు మెడికో ఎంపిక .. రూ.2 కోట్ల వేతనం

గుంటూరు మోడికోను ఓ బంపర్ ఆఫర్ వరించింది. అమెరికా వైద్య విశ్వవిద్యాలయమైన స్టాన్‌ఫోర్డ్‌లో పాఠాలు బోధించే అధ్యాయపక వృత్తికి ఎంపికయ్యాడు. అదీకూడా ఎలాంటి వీసా అక్కర్లేకుండా యుఎస్‌కు వెళ్లే ఛాన్స్ దక్కించు

Advertiesment
Guntur medico
, సోమవారం, 21 ఆగస్టు 2017 (16:12 IST)
గుంటూరు మోడికోను ఓ బంపర్ ఆఫర్ వరించింది. అమెరికా వైద్య విశ్వవిద్యాలయమైన స్టాన్‌ఫోర్డ్‌లో పాఠాలు బోధించే అధ్యాయపక వృత్తికి ఎంపికయ్యాడు. అదీకూడా ఎలాంటి వీసా అక్కర్లేకుండా యుఎస్‌కు వెళ్లే ఛాన్స్ దక్కించుకోవడమేకాకుండా ఏకంగా నెలకు రూ.2 కోట్ల వేతనాన్ని అందుకోనున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరులో ఎంబీబీఎస్ పూర్తిచేసిన డాక్టర్ మిక్కిలినేని కార్తీక్‌ యువకుడు 2012లో న్యూయార్క్ వెళ్లి అక్కడి పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో 'వాస్‌క్యులర్ సర్జరీ'లో ఎండీ పూర్తి చేశాడు. ఈ విభాగంలో మొత్తం 11 సీట్లు ఉంటే అందులో 10 మంది అమెరికా వారు కాగా అమెరికాయేతర వ్యక్తి కార్తీక్ మాత్రమే కావడం గమనార్హం. 
 
అతని పరిజ్ఞానానికి మెచ్చి.. వైద్య విశ్వవిద్యాలయం స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్‌లో 'వాస్‌క్యులర్ సర్జరీ' విభాగంలో సహాయ ఆచార్యుడిగా బోధించేందుకు ఎంపిక చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ విజ్ఞప్తితో ప్రభుత్వం అతనికి 'ఓ-వన్ ఏ' వీసాను జారీ చేసింది. వీసా అవసరం లేకుండానే అమెరికాలో ఉండి పాఠాలు బోధించే అవకాశాన్ని 'ఓ-వన్ ఏ' వీసా కల్పిస్తుంది. 
 
దీంతో వచ్చే అక్టోబరు ఒకటో తేదీ నుంచి వర్శిటీలో అధ్యాపకుడిగా కార్తీక్ బాధ్యతలు చేపట్టనున్నారు. అతనికి ఏడాదికి రూ.2.08 కోట్లు వేతనంగా అందుకోనున్నారు. అయితే, ఆయన మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకు తన కుమారుడు ఎంపిక కావడంపై తండ్రి పురుషోత్తం సంతోషం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మార్ట్ ఫోన్ కోసం బెట్ కట్టాడు.. జీలం నదిలో కొట్టుకుపోయాడు (వీడియో)