Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడప జిల్లాలో కాల్పుల కలకలం.. భగ్గుమన్న ఫ్యాక్షన్ కక్షలు - ఇద్దరు మృతి

కడప జిల్లాలో కాల్పుల కలకలం.. భగ్గుమన్న ఫ్యాక్షన్ కక్షలు - ఇద్దరు మృతి
, మంగళవారం, 15 జూన్ 2021 (09:40 IST)
రాయలసీమ ప్రాంతమైన కడప జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ  కక్షల కారణంగా తుపాకీ కాల్పుల మోతమోగింది. ఈ జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే పులివెందుల మండలం మండ‌లం న‌ల్ల‌పురెడ్డిప‌ల్లెలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. 
 
ప్రసాద్ రెడ్డి తన లైసెన్స్ తుపాకితో పార్థసారథి రెడ్డి అనే వ్యక్తిపై కాల్పలు జరిపాడు. దీంతో ఘటనా స్థలంలోనే పార్థసారథి రెడ్డి మృతి చెందాడు. అనంత‌రం ప్రసాద్‌రెడ్డి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇరువురూ మృతి చెందారు. 
 
వ్యక్తిగత గొడవలే ఘటనకు కారణమని స్థానికులు అనుకుంటున్నారు. గత కొంత కాలం ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగదాలు నెలకొన్నాయి. ఇదే అంశంపై చాలా సార్లు గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆస్తి విష‌యంలో వివాదాలే కాల్పుల‌కు కార‌ణమ‌ని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో డిగ్రీ ఇక ఇంగ్లీష్ మీడియంలోనే..