Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గంజాయి.... తెనాలి వయా తిరుపతి టు విల్లుపురం

తిరుపతిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి తమిళనాడు రాష్ట్రం విల్లుపురంకు 24 కేజీల గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 2 లక్షల రూపాయల

గంజాయి.... తెనాలి వయా తిరుపతి టు విల్లుపురం
, బుధవారం, 9 ఆగస్టు 2017 (22:08 IST)
తిరుపతిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి తమిళనాడు రాష్ట్రం విల్లుపురంకు 24 కేజీల గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 2 లక్షల రూపాయల విలువ చేసే ఐదు బ్యాగులలోని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
 
నిందితుడు తమిళనాడు రాష్ట్రం తేనె ప్రాంతానికి చెందిన వారుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. తిరుపతిలో భారీగా గంజాయి పట్టుబడడం తీవ్ర కలకలం రేపుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలకు తుపాకీతో కారులో... అడిగితే సైలెంటుగా కూర్చున్న కపుల్...(వీడియో)