పిఠాపురం మాజీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పెండెం దొరబాబు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. దొరబాబుకు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన శాసనమండలి విప్ హరిప్రసాద్, కాకినాడ పార్లమెంటు సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సహా జనసేన కీలక నాయకులు పాల్గొన్నారు.
పెండెం దొరబాబుతో పాటు, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కూడా జనసేనలో చేరారు. నాదెండ్ల మనోహర్ వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
శనివారం జనసేనలో చేరిన వారిలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి పద్మ బుజ్జి, గొల్లప్రోలు మార్కెట్ కమిటీ చైర్మన్ మొగిలి వీర వెంకట సత్యనారాయణ ఉన్నారు.