Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.కోటి దుర్వినియోగం... ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సస్పెన్షన్

Advertiesment
sanjay
నిధుల దుర్వినియోగం కేసులో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెడ్ చేసింది. పైగా, విజయవాడ నగరం వదిలి వెళ్లొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ గత వైకాపా ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో వైకాపా పెద్దలతో అంటకాగి, ఇష్టానురీతిలో రెచ్చిపోయారు. అనేక రకాలైన అవినీతి చర్యలకు పాల్పడ్డారు. ఈ విషయం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. 
 
సీఐడీ చీఫ్‌గా సంజయ్ బాధ్యతలు చేపట్టకముందు అగ్నిమాపకదళ విభాగం డీఐజీగా పని చేశారు. ఆ సమయంలో ఆయన రూ.కోటి మేరకు నిధులను దుర్వినియోగం చేసినట్టు విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. చేపట్టిన పనులు పూర్తి చేయకుండానే భారీ మొత్తంలో చెల్లింపులు చేసినట్టు గుర్తించింది. సౌత్రిక టెక్నాలజీసి అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి సంజయ్.. ఈ మేరకు దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిసింది. 
 
దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సంజయ్‌పై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. సంజయ్ ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీచేసింది. దళితులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆయనను ఏపీ ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామా మారబోతుంది...