Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైజాగ్‌లోని హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

వైజాగ్‌లోని హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం
, మంగళవారం, 25 మే 2021 (16:09 IST)
విశాఖపట్టణంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నగరంలో ఉన్న హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ పాత టెర్మిన‌ల్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టుగా భావిస్తున్నారు. 
 
సీడీయూ 3వ యూనిట్‌లో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. 
 
ఈ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ శ‌బ్దం వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు సైరన్‌ మోగించిన ఉద్యోగులను అందరినీ బయటకు పంపారు. ప్ర‌మాద స్థ‌లంలో ఆరుగురు ఉద్యోగులు, మ‌రికొంద‌రు కార్మికులు ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ శబ్దంతో విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం, పరుగులు తీసిన ఉద్యోగులు