Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అజాత శ‌త్రువు, రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర‌...రోశ‌య్య‌

Advertiesment
అజాత శ‌త్రువు, రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర‌...రోశ‌య్య‌
విజ‌య‌వాడ , శనివారం, 4 డిశెంబరు 2021 (10:15 IST)
మాజీ ముఖ్యమంత్రి  కొణిజేటి రోశయ్య మృతి కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రోశయ్య  ఆత్మకు సద్గతులు  క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్రసాదించాల‌ని ప్రార్థించారు. రోశయ్య  మరణంతో  గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆదర్శవాదిని  కోల్పోయామని శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 
 
 
మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య అజాత శత్రువుగా రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్  కొనియాడారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు.

విద్యార్థి సంఘ  నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారన్నారు. వివాదరహితుడిగా నిలిచారని తెలిపారు. తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన సేవలనందించారన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇక లేరు