Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యపై అనుమానం... లక్ష రూపాయలకు అమ్మేశాడు.. ఆ తరువాత?

కట్టుకున్న భర్తే తాగుడుకు బానిసై భార్యను అమ్మేశాడు. అది కూడా వ్యభిచార గృహానికి.. రెండు నెలల పాటు చిత్ర హింసలు అనుభవించిన ఆ మహిళ చివరకు ఎలాగోలా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

భార్యపై అనుమానం... లక్ష రూపాయలకు అమ్మేశాడు.. ఆ తరువాత?
, శుక్రవారం, 25 మే 2018 (18:19 IST)
కట్టుకున్న భర్తే తాగుడుకు బానిసై భార్యను అమ్మేశాడు. అది కూడా వ్యభిచార గృహానికి.. రెండు నెలల పాటు చిత్ర హింసలు అనుభవించిన ఆ మహిళ చివరకు ఎలాగోలా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
ఎమ్మిగనూరు పట్టణంలోని గాంధీ వీధికి చెందిన రాజేష్‌ అనే వ్యక్తికి సంవత్సరం క్రితం అదే ప్రాంతానికి చెందిన సుజాతతో వివాహమైంది. ఆరు నెలల వరకు వీరి సంసారం బాగానే సాగింది. ఇంట్లో తన తండ్రి పెన్షన్ డబ్బుపై ఆధారపడి జీవించే వారు రాజేష్ కుటుంబం. ఉద్యోగం లేకపోవడంతో బాధతో తాగుడుకు బానిసైన రాజేష్‌ రోజూ తాగొచ్చి చిత్ర హింసలు పెట్టేవాడు. భర్త తాగుడు కోసం సుజాత ఇళ్ళల్లో పాచి పని చేస్తూ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది. 
 
అయితే భార్యపై అనుమానం పెట్టుకున్న భర్త రెండు నెలల క్రితం పూటుగా మద్యం తాగొచ్చి బయటకు వెళదామని సుజాతను స్కూటర్ పైన ఎక్కించుకుని వ్యభిచార గృహానికి తీసుకెళ్లి లక్ష రూపాయలకు అమ్మేశాడు. దీంతో సుజాత రెండు నెలల పాటు వ్యభిచార గృహంలో నరక యాతన అనుభవించి నిన్న మధ్యాహ్నం తప్పించుకుని బయటకు వచ్చి ఎమ్మిగనూరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి పలువురు మహిళలను విడిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలపరీక్షలో నెగ్గిన కుమార స్వామి.. కొలువుదీరనున్న సంకీర్ణ సర్కారు..