Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మతిమరుపు రోగం వచ్చిందా వీసా రెడ్డి? : అయ్యన్నపాత్రుడు

మతిమరుపు రోగం వచ్చిందా వీసా రెడ్డి? : అయ్యన్నపాత్రుడు
, మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:02 IST)
వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ట్విట్టర్ లో విజయసాయిరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

"మతిమరుపు రోగం వచ్చిందా వీసా రెడ్డి? వ్యవసాయ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చింది మర్చిపోయావా ? ఈ బిల్లుని సమర్ధించని వాళ్ళు అందరూ దళారీలు అంటూ వ్యాఖ్యలు చేసి, రాజ్యసభలో అందరి చేత బూతులు తిట్టించుకుంది మర్చిపోయావా ? ఎక్కడైనా నీ ప్రసంగంలో 'స్వామినాథన్ కమిటీ' పేరు ఎత్తావా ?

తెలుగుదేశం పార్టీ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది, కార్పొరేట్ ల ఆధిపత్యం గురించి, మద్దతు ధర గురించి, మార్కెట్ల పటిష్టత గురించి, కాంట్రాక్టు ఫార్మింగ్ వల్ల రైతులు ఎలా నష్టపోయేది, ఇలా అనేక అంశాల పై తెలుగుదేశం పార్టీ కీలక సూచనలు ఇచ్చిన సంగతి మర్చిపోయావా ?

బేషరతుగా మద్దతు ఇచ్చి, ఇప్పుడు నాటకాలు ఆడతారా ? ఇందుకు కాదు మిమ్మల్ని ఫేక్ ఫెల్లోస్ అనేది" అంటూ నిప్పులు చెరిగారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంచికచర్లలో బంద్ ప్రశాంతం