Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంద్ర పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కి, ఏపీకి సంబంధం లేదు

ముంద్ర పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కి, ఏపీకి సంబంధం లేదు
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (16:33 IST)
ముంద్ర పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కి, ఏపీకి ఎటుంటి సంబంధం లేద‌ని ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్ వివ‌ర‌ణ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో డ్రగ్స్ పట్టుబడినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్త‌వం లేద‌న్నారు. దీనికి ఆంధ్ర ప్రదేశ్ కి ఎటువంటి సంబంధం లేదు అని మరోసారి స్పష్టం చేశారు.
 
గతంలో ఎన్నడలేని విధంగా రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నాం అని డిజిపి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో కలసి పని చేస్తూ  గంజాయి సాగు, రవాణాను నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామ‌న్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులపై గట్టి నిఘా ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారందరినీ చట్టం ముందుకు తీసుకు వస్తామ‌ని చెప్పారు. 
 
ఇప్పటికే  463 మంది అంతర్ రాష్ట్ర నిందితులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టామ‌ని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఇప్పటికే అత్యధిక స్థాయిలో మూడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు పదిహేను వందల వాహనాలను జప్తు చేసి, ఐదు వేల మంది నిందితులను అరెస్టు చేశాం అని వివ‌రించారు. సంబంధం లేని అంశాలపై అసత్య ఆరోపణలు చేయ‌డం మానుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్న‌ట్లు డీజీపీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోష‌ల్ మీడియాలో ప్రేమ వ్య‌వ‌హారం... బ్లేడ్ తో గొంతు కోసి...